సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా .. మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్ గా సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నేతృత్వంలో నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆధ్వర్యంలో దర్శకుడు: పరశురాం తెరకెక్కించగా సంగీతం: తమన్ అందించగా సినిమాటోగ్రఫి: ఆర్ మది
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ పని చేయగా ఈరోజు మే 12, 2022న విడుదలైన మూవీ సర్కారు వారి పాట ..
ఈ మూవీలో తన పాత్ర వివరాలను హీరోయిన్ కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘కళావతి లాంటి పాత్ర ఇంతకుముందు. చేయలేదు. అందుకే ఈ సినిమాలో నటించడం సంతోషంగా అనిపించింది. దర్శకుడు పరశురాం సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత వుంటుంది. ఈ కళావతి పాత్ర కీలకం. ఇంతపెద్ద కమర్షియల్ మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం. కథ విన్న వెంటనే ఓకే చెప్పా’ అని తెలిపింది.