తీన్మార్ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ షాక్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్ నోటీసు పంపించారు. ఏప్రిల్ 17న మల్లన్న తన యూట్యూబ్ ఛానల్లో మంత్రి అజయ్పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నపై మంత్రి అజయ్ రూ.10కోట్ల పరువునష్టం దావా వేశారు.