Home / SLIDER / దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం

దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం

శతాబ్దాలపాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక వివక్షను ఎదుర్కొన్న దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, దళితబంధు పథకం చరిత్రాత్మకమని డిప్యూటీ స్పీకర్‌, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ అన్నారు.

సీతాఫల్‌మండి బీదల్‌బస్తీ మైదానంలో 25 మంది దళితబంధు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్‌ ఆటో, మినీట్రాలీలు, రవాణా వాహనాలు, కార్లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో డిప్యూటీస్పీకర్‌ పద్మారావుగౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించి 8 ఏండ్లలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మారిపోయిందన్నారు.

త్వరలో సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మరో 1500 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని హామీఇచ్చారు. దళితబంధుతోపాటు, వైన్స్‌, ఫెస్టిసైడ్స్‌ దుకాణాలు, మందుల దుకాణాలు, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో సైతం దళితులకు ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, సునీత, శైలజ, ప్రసన్న, కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్‌, రాజసుందర్‌, జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat