కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. గత సంవత్సరం కూడా ఈ వైరస్ కేరళలో వెలుగుచూసింది. మరోసారి వెలుగు చూడటంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.