Home / SLIDER / సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్

సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్

తెలంగాణలో సమస్యలే లేవని చెబుతున్న ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, మంత్రి కేటీ రామారావులు ఒక్కరోజు తనతో పాదయాత్రకు వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తానని  వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు.

సమస్యలు లేకుంటే తాను ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని, సమస్యలు చూపిస్తే కేసీఆర్‌ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా ? అని సవాల్‌ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా మధిరలోని అంబేడ్కర్‌ సెంటర్లో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.

దళిత నియోజకవర్గమైన మధిర నుంచి సవాల్‌ చేస్తున్నానని, చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. బీజేపీ నేతలు మతం మత్తులో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రె్‌సలో గెలిచివారు పశువుల్లాగా టీఆర్‌ఎస్‌ సంకనెక్కారని, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క దళిత బిడ్డ అని, ఆయనకు రాజకీయ భవిష్యత్‌ కల్పించింది వైఎస్సార్‌ అని చెప్పారు.  టీఆర్‌ఎ్‌సలో చేరని భట్టిని మెచ్చుకోవాల్సిందేనన్నారు. అయితే, వైఎస్సార్‌ ఫొటో పెట్టుకొని గెలిచిన భట్టి ఆయన పేరును కాంగ్రెస్‌ వారు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చితే ఏం చేశారని ప్రశ్నించారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat