Home / ANDHRAPRADESH / ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్‌

ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్‌

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను వెంటనే పూర్తిచేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కర్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని.. నాడు-నేడుతో చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు.

జులై 15 నాటికి గుంతలన్నీ పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలో పెట్టాలని సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి సాయం, రుణాలు అందకుండా కేసుల ద్వారా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని జగన్‌ ఆరోపించారు. అయినా సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకుసాగుతున్నామని.. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తిచేస్తున్నామని జగన్‌ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat