Home / ANDHRAPRADESH / ఆత్మకూరు బైపోల్‌.. వైసీపీకి తిరుగులేని విజయం

ఆత్మకూరు బైపోల్‌.. వైసీపీకి తిరుగులేని విజయం

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు.

మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్‌లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన ఉప ఎన్నికలో 2,13,338 ఓట్లకు గాను.. 1,37,081 ఓట్లు పోలయ్యాయి.

వీటిలో విక్రమ్‌రెడ్డికి మొత్తం 1,02,074 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌యాదవ్‌కు 19,332, బీఎస్పీకి 4,897, నోటాకు 4,197 ఓట్లు పడ్డాయి. వైసీపీ ఘన విజయం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. సీఎం జగన్‌ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat