వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ YSవిజయమ్మ ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి ఆమె హాజరై మాట్లాడారు. తమ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతి మనిషినీ ప్రేమించారన్నారు.
తమ కుటుంబ అనుబంధం, సంస్కారం గొప్పవని చెప్పారు. తామే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే ఓదార్చారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్తో ఉన్నానని.. బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని తన మనస్సాక్షి చెబుతోందన్నారు.
తన ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించున్నట్లు విజయమ్మ స్పష్టం చేశారు. ఈ విషయంలో అందరూ తనను క్షమించాలని విజయమ్మ కోరారు.