టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ వచ్చే సీజన్ భారత్లోనే జరగనుంది. దీంతో జిమ్ కసరత్తులు చేస్తున్న ఫోటో షేర్ చేశాడు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫండ్ రైజింగ్ కోసం ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుండటం బాగుంది. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నా. దిగ్గజాలు ఆడే LLCలో భాగం కాబోతున్నా. త్వరలో క్రికెట్ బంతిని ఎదుర్కోబోతున్నా’ అని తెలిపాడు.