ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాకోసం విహారయాత్రకు వెళ్లిన ఓ కుంటుంబంలో ఆరుగురు జలపాతంలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు. .
మధ్యప్రదేశ్కు చెందిన 15 కుటుంబ సభ్యులు ఆదివారం రాయ్పూర్కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్దహా వాటర్ఫాల్ వద్ద పిక్నిక్కు వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానం చేసేందుకు ఏడుగురు వెళ్లగా వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం రెండు మృత దేహాలను గుర్తించిన అధికారులు హాస్పిటల్కి తరలించారు. చీకటి కావడంతో సెర్చ్ ఆపేసిన అధికారులు తిరిగి సోమవారం ఉదయం ప్రారంభించి మిగతా మృత దేహాలను బయటకు తీశారు. జలపాతం వద్ద స్నానం చేయొద్దని హెచ్చరిక బోర్డు పెట్టినప్పటికీ పర్యాటకులు నీటిలోకి వెళ్లడంతోనే ఈ ఘటన జరిగిందని ఆక్కడి కలెక్టర్ కుల్దీప్ శర్మ తెలిపారు.