ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది.
అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో గ్రీన్ 61, వేడ్ 45*, స్మిత్ 31 రన్స్ చేశారు. మరోవైపు ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేశ్ 2, చాహల్ 1 వికెట్ తీశారు. భారత ఫీల్డర్లు 3 క్యాచ్ లు విడిచిపెట్టడం.. హర్షల్ పటేల్, భువనేశ్వర్ ఇద్దరు కలిసి 8 ఓవర్లలో 101 రన్స్ ఇవ్వడం ఓటమికి ప్రధాన కారణాలు.