Home / NATIONAL / జియో బంఫర్ ఆఫర్.. తక్కువ ధరకే ల్యాప్‌టాప్!

జియో బంఫర్ ఆఫర్.. తక్కువ ధరకే ల్యాప్‌టాప్!

మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్‌ జియో రెడీ అవుతోంది. మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంఛ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను మాత్రమే పరిచయం చేసిన దిగ్గజ సంస్థ.. ఇప్పుడు కొత్తగా ల్యాప్‌టాప్‌లను తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం రూ.15వేలకే ల్యాప్‌టాప్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని జియో బుక్‌పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది.

 ఈ ల్యాప్‌టాప్‌ 4జీ నెట్‌వర్క్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌లలో కొన్ని యాప్‌లకుప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఓఎస్‌ను అందించనుంది. ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ను క్వాల్‌కామ్‌ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. తక్కువ ధరకే జియో ల్యాప్‌ట్యాప్‌రానుండటం.. ఇతర కంపెనీలకు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat