Home / MOVIES / హిందీ ‘దృశ్యం’-2 ట్రైలర్ విడుదల

హిందీ ‘దృశ్యం’-2 ట్రైలర్ విడుదల

 ఇండియన్‌  ది బెస్ట్‌ థ్రిల్లర్‌ సినిమాల లిస్ట్‌ తీస్తే.. అందులో ఈ సినిమా టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది ‘దృశ్యం’ ఒకటి.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఒక సంచలనం. ఈ సినిమాలో స్క్రీన్‌ ప్లే గానీ, నటీనటులు పర్‌ఫార్మెన్స్‌ గాని వేరే లెవల్లో ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, తమిళంలో కమల్‌హాసన్‌, హిందీలో అజయ్‌ దేవగన్‌లు రీమేక్‌ చేశారు. ఇక ఈ మూడు భాషల్లోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది.గతేడాది ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కింది.

జీతూ జోసేఫ్ రెండో పార్టును మరింత గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా తెరకెక్కించాడు. అదే థ్రిల్‌ ఫీలై ప్రేక్షకులు సెకండ్‌ పార్ట్‌ను మరింత హిట్ చేశారు. సెకండ్‌పార్ట్‌ను తెలుగులో జీతూజోసెఫ్, వెంకటేష్‌తో తెరకెక్కించాడు. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌ వంతుకు వచ్చింది. అజయ్‌ దేవగన్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ సీక్వెల్‌కు అభిషేక్‌ పతక్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌చేసింది.లేటెస్ట్‌గా రిలీజైన ట్రయిలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఒరిజినల్‌ కథను కొంచెం కూడా చేంజ్‌ చేయకుండా రీమేక్‌ చేసినట్లు ట్రయిలర్‌ చూస్తే తెలుస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం థ్రిల్‌ ఫీల్‌ను కలిగిస్తుంది. సధీర్‌ కుమార్‌ కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఏడేళ్ళ తర్వాత రీ ఓపెన్‌ అయిన మర్డర్‌ కేసును మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక ఈ సారి హీరో మరియు తన కుంటుంబం పోలిసుల నుండి తప్పించుకుందా తప్పించుకుంటే ఎలా తప్పించుకుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌కు జోడీగా శ్రీయా శరణ్‌ హీరోయిన్‌గా నటించింది. టబు, అక్షయ్‌ఖన్నా కీలకపాత్రల్లో నటించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 18న రిలీజ్‌ కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat