గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బండి, విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఖుధిరాంబోస్ మూవీలు ఉన్నాయి. వీటితో మేజర్ హిందీ వెర్షన్ కూడా ఎంపిక అయ్యింది. నాన్ ఫీచర్ ఫిల్మ్స్లో తెలుగు నుంచి ఏ మూవీ సెలెక్ట్ అవ్వలేదు.
