Home / MOVIES / నేను మోసం చేసింది వాళ్లనే -కుండ బద్దలు కొట్టిన పూరీ జగన్నాథ్

నేను మోసం చేసింది వాళ్లనే -కుండ బద్దలు కొట్టిన పూరీ జగన్నాథ్

హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మార్కును చూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవల రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి ప్రధాన పాత్రలో.. బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీ రోల్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. తానే నిర్మాతగా తీసిన మూవీ లైగర్..

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ ప్లాప్ అవ్వడంతో సినిమాను కొన్న బయ్యర్లంతా పూరీ జగన్నాథ్ ఇంటి దగ్గర ధర్నాకు కూడా దిగారు. అయితే దీనిపై పూరీ జగన్నాథ్ స్పందిస్తూ నేను ఇంతవరకు నాకు నేను మోసపోవడం.. ప్రేక్షకులను మోసం చేయడం తప్పా ఎవర్ని మోసం చేయలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. సినిమా హిట్టయితే డబ్బు వస్తుందని.. అదే ప్లాప్ అయితే మంచి జ్ఞానం వస్తుంది..

అలాంటప్పుడు తన వారు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుందని ఆయన అన్నారు. అయితే టికెట్ కొని చూసే ప్రేక్షకుల పట్ల తానెప్పుడు బాధ్యతగా ఉంటాను. సినిమా హిట్ అయితే అంతకుమించి హిట్ అందించి ఆనందాన్ని అందిస్తా. అదేప్లాప్ అయితే ఇంకో మూవీ తీసి ప్రేక్షకులు పెట్టే డబ్బులకు న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat