చిత్తూరు: జనసేన అధినేత పవన్కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా వ్యాఖ్యానించారు. పవన్ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందని ఆమె ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటా గెలవలేకపోయారన్నారు. తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు.