Home / POLITICS / CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కే‌సి‌ఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !

CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కే‌సి‌ఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !

CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా ఉందనే చెప్పాలి. తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల హడావుడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితులన్నీ దాటి మూడోసారి అధికారం అందుకోవడం ముందస్తుతో మాత్రమే సాధ్యమన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యం లోనే జిల్లాల పర్యటనకు సీఎం కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. డిసెంబర్ నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు… మరోవైపు బహిరంగ సభలతో ఎన్నికల వాతారవరణం క్రియేట్ చెయ్యబోతున్నట్టు సమాచారం అందుతుంది. డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్, జగిత్యాలలో రెండు బహిరంగ సభల్లో పర్యటించబోతున్నారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత మహబూబాబాద్‌లో మరో బహిరంగ సభ నిర్వహించేలా టీఆర్‌ఎస్ రోడ్ మ్యాప్ సిద్దమయింది.

డిసెంబర్ 4న ఉమ్మడి పాలమూరులో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే మహబూబాబ్ నగర్ జిల్లా నాయకత్వం ఈ సభ పనుల్లో ఉన్నారు. ఇక డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సంబంధించిన బాధ్యతలను ఎమ్మెల్సీ కవితకు అప్పగించినట్టు తెలుస్తోంది. పోడు భూముల సమస్యతో పాటు, గిరిజన బంధు పథకానికి సంబంధించిన కీలక ప్రకటన ఈ బహిరంగ సభలో సీఎం కే‌సి‌ఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat