MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా కన్నబాబు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగాబ్ ఆయన మాట్లాడుతూ… ఈ దేశానికి బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని… ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారని… రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబమీ విమర్శించారు. అధికారంలో లేనప్పుడే చంద్రబాబుకు రాజ్యాంగం గుర్తుకు వస్తుందని… అధికారంలో ఉన్నప్పుడు స్వప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని చంద్రబాబుపై కన్నబాబు ఫైర్ అయ్యారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎవరు వ్యవహరిస్తున్నారో చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. కళ్లబొల్లి కబుర్లతో ఎంతకాలం ప్రజలను మోసగిస్తారని ఎద్దేవా చేశారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజ్యాంగ పరిరక్షణా అంటూ మండిపడ్డారు. వెన్నుపోటుతో ఎన్టీఆర్ను కూలదోయడం రాజ్యాంగ పరిరక్షణా… రాజ్యాంగ స్ఫూర్తి, పరిరక్షణ గురించి చంద్రాబాబా మాట్లాడేది అంటూ నిప్పులు చెరిగారు. కాగా మరో వైపు కొవ్వూరు టీడీపీలో మరోసారి వర్గ విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. అయితే, టీడీపీ ఏర్పాటు చేసిన సభలో బుచ్చయ్య చౌదరి ఎదుటే జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహికి దిగాయి. కాగా రెండు వర్గాల ఆందోళనలతో సమావేశం అర్థాంతరంగానే ముగిసింది. ఈ ఘటనతో చంద్రబాబు కార్యకర్తల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.