ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దేశ రాజధాని మహానగర మేయర్ పీఠాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పోరేషన్ను ఏలుతున్న బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. వరుసగా మూడు పర్యాయాలు మేయర్ పీఠం దక్కించుకున్నది బీజేపీ..
ఇప్పుడు నూట మూడు వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది.ప్రస్తుతం ఆప్ మరో 8 వార్డుల్లో, బీజేపీ 6 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు వార్డుల్లో మాత్రమే గెలిచి, మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు.