నిత్యం ఏదోక వార్తతో వివాదానికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే బాలీవుడ్ సెక్సీ హీరోయిన్.. హాటేస్ట్ భామ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఈ హాట్ భామ వార్తల్లో నిలిచారు.
తాను ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది..
దీంతో పార్లమెంట్ కు సంబంధించి సన్నివేశాల కోసం అక్కడ షూటింగ్ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కంగనా టీమ్ పార్లమెంట్ సెక్రెటేరియట్ కు లేఖ రాసింది. అయితే తాను అడిగిన దానికి అనుమతి రాకపోవచ్చు అని ఓ అధికారి తెలిపారు. ఎందుకంటే పార్లమెంట్ లోపల బయట ప్రైవేట్ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ చిత్రీకరణకు అనుమతి ఉండదు..