Politics ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పర్యాటకంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ గవర్నమెంట్ తాజాగా కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చూస్తుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి పరిచి తెలంగాణకే టూరిజం స్పాట్ల గా మార్చాలనేదే సీఎం కేసీఆర్ యొక్క లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు గతంలో కరీంనగర్ అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదని కావున తాము కరీంనగర్ ని అభివృద్ధి చేయడానికి సంకల్పం పూనుకున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణలో తాము మానే రివర్ ఫ్రంట్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా 69 కోట్ల రూపాయలతో వాటర్ ఫౌంటెన్ పనులకు తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి భూమిపూజ ప్రారంభించారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రెండ్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 410 కోట్లని అందులో 310 కోట్లు ఇరిగేషన్కు 100 కోట్లు పర్యాటక శాఖకు సంబంధించినవి అని తెలిపారు. జూన్ రెండు నాటికి ఈ ఫౌంటెన్ పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. అలాగే పర్యటకం పరంగా తెలంగాణ రోజురోజుకీ అభివృద్ధి చెందుతుందిగా చెప్పాలి ముఖ్యంగా హైదరాబాద్ చూడటానికి టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడానికి అంతటి గొప్ప పేరు ఉంది వీటన్నిటిని త్వరలోనే మరింత అభివృద్ధి చేస్తామని ఇప్పటికే పలు మార్లు కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.