Home / POLITICS / Telengana Tourism : కరీంనగర్ వాసులకు శుభవార్త తెలిపిన పర్యాటక శాఖ మంత్రి గంగుల కమలాకర్..

Telengana Tourism : కరీంనగర్ వాసులకు శుభవార్త తెలిపిన పర్యాటక శాఖ మంత్రి గంగుల కమలాకర్..

Telengana Tourism తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణకు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను, మరెన్నో పథకాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. కరీంనగర్ మానేరు నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14వ తారీకు నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక శుభ వార్తను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఒకవైపు అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూనే మరొకవైపు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను, కట్టడాలను ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తోంది. కరీంనగర్ మానేరు నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14వ తారీకు నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తాము అత్యంత ఆధునిక సాంకేతికతో ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం చేపట్టామని దాదాపు 225 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి ఖర్చు చేసామని దీనివలన ప్రజలకు ఎంతో ఉపయోగ కలుగుతుందని ఆయన పేర్కొన్నాడు

ప్రజలకు, పర్యాటకులకు ఉపయోగపడే విధంగా ఏప్రిల్ 14వ తారీకు నుండి ఈ కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తామని ఇది పర్యాటకులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిపై ఆహ్లాదంగా గడిపేందుకు కొద్దిరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి సందర్శకులు మరింత ఆకట్టుకునే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat