ఏపీ రాజకీయ వర్గాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .ఈ విషయంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతల మధ్య అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వేదిక ఏదైనా సరే మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది.గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని ఏపీ ముఖ్యమంత్రి
,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అసెంబ్లీ సాక్షిగా అభినందిస్తూ తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపారు అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
See Also:సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!
ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారు అని టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా బీజేపీ తో కొనసాగాలా వద్దా అనేది తేల్చి చెప్తా అని ప్రకటించారు.
See Also:జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
అందులో భాగంగా ఒకవేళ చంద్రబాబు తమతో పొత్తు వద్దని ప్రకటించిన క్షణానే టీడీపీ మంత్రి వర్గంలో కొనసాగుతున్న తమ పార్టీ నేతలు మాణిక్యాల రావు ,కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేయాలనీ బీజేపీ పార్టీ జాతీయ అధిష్టానం సూచించినట్లు సమాచారం .అంతే కాకుండా తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాకుండా ఏకంగా గవర్నర్ కు సమర్పించాలని కూడా ఈ సందర్భంగా ఆదేశించారు అని సమాచారం.అయితే బీజేపీ మంత్రుల రాజీనామా బాబు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉందన్నమాట ..
See Also:జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ డెసిషన్ ..!
See Also:బాబుకు జగన్ మగాడి సవాలు-జగన్ సవాలును బాబు స్వీకరిస్తాడా ..!