ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాల వలన వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పక్కనపెట్టి కనీసం గెలిచే అవకాశాలు లేనంతగా ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత చోటు చేస్కుంది .
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడం ఖాయమనే విషయాన్నీ ఇప్పటికే పలు సర్వేలు నిరూపించాయి.అయితే వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీడీపీలో ఉండి ఎన్నికలకు వెళ్ళితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వారికి తెల్సి వచ్చింది .అందుకే వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరాలని తహతహాలాడుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ,ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పిడుగు లాంటి వార్తను తెలిపారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు తిరిగి వైసీపీ పార్టీలోకి వస్తామంటే చేర్చుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు .ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇటు పార్టీ అధిష్టానం అటు తమని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వైసీపీలో చోటు లేదని ఆయన అన్నారు ..