తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమం పట్ల ఎంతటి నిబద్దతతో పనిచేస్తారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా వారి వద్దకు వెళ్లగా…ఆ శాసనసభ్యుడి తీరు వారిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఎమ్మెల్యే తీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అలా ప్రజల మనసును గెలుచుకున్నది మరెవరో కాదు…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, పరిపాలన విషయంలో వారికి ఎదురవుతున్న అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వివేకానంద్ ఇటీవల తన నియోజకవర్గంలోని ఓ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి వారి అనుభవాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమ వద్దకే వచ్చి మరీ ఇలా స్పందించిన తీరు నచ్చిన ఓ నెటిజన్ అదే విషయాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్కు కూడా ట్యాగ్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించారు. గుడ్ జాబ్ ఎమ్మెల్యే గారు అంటూ ప్రశంసించారు.
Good job MLA @kp_vivekanand Saab ? https://t.co/IIwUc4wGDO
— KTR (@KTRTRS) June 10, 2018
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే వివేకానంద కృషిచేస్తున్నారని, ఇలా ఎందరో ప్రజల మనసులను గెలుచుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు. ఇందుకు తాజాగా మంత్రి కేటీఆర్కు ఓ నెటిజన్ ట్వీట్ చేయడం, ఆయన స్పందించడం నిదర్శనమని అంటున్నారు.
see also:ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ
Respected MLA Sir, KP.Vivenkanand Garu,visited our colony and our Apartment to address Park, CCTV, water issues.
True Governance reaching to PPL. Jai TRS, Jai Telangana.@kp_vivekanand @vivekanand_kp @KTRTRS @TelanganaCMO @trspartyonline pic.twitter.com/zNx3OHXCHi— Nilash Pustakala (@NilashPustakala) June 10, 2018