ఏ చిత్ర బృందమైనా.. ముందే విడుదల తేదీ ప్రకటిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందాలు చాలా అలెర్ట్గా వ్యవహరిస్తుంటాయి. మరో సినిమా ఇదే రోజున రాకుండా కర్చీఫ్ వేసేసుకుంటుంది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. ఇలా ఖర్చీఫ్ వేసిన టాలీవుడ్ సినిమాలేమిటో తెలుసా..?
అయితే, వరుణ్ తేజ్, అతిధిరావు, హైదరి జంటగా ఘాజీ ఫేమ్ సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో క్రిష్ నిర్మిస్తున్న చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ అంటూ డేట్ను ఫిక్స్ చేసుకున్నారు. ఇక నట రుద్రుడు ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ ఇంకా విడుదల తేదీని ఫిక్స్ చేసుకోకోకున్నా.. పండక్కి రావడం ఖాయం. దీనికి తగ్గట్టే షూటింగ్ను కూడా వేగంగా పూర్తి చేసుకుంటోంది. దసరాకు ఇంకా మూడు నెలలు ఉంది. దీంతో ఎవరికి వారు డేట్స్ను ఎనౌన్స్ చేసే పననిలో పడ్డారు. అక్టోబర్ 18న పందెంకోడి -2 రిలీజ్ అంటూ విశాల్ ప్రకటించిన మరుసటి రోజే రామ్ నటిస్తున్న హలో గురు ప్రేమ కోసమే డేట్ను ఎనౌనస్ చేశాడు నిర్మాత దిల్రాజు. రామ్, విశాల్ సినిమాలు రెండూ.. అక్టోబర్ 18న వస్తుండటం విశేషం. పోటీని అధిగమించేందుకు నాగార్జున, నాని నటిస్తున్న దేవదాసును సెప్టెంబర్ 29న, నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న శైలజారెడ్డి చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేసేందుకు నిర్మాతలు డేట్ను ఫిక్స్ చేసేశారు.