ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు గురించి ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తుంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు శ్రీనివాస్ హజరయ్యాడు.ఈ సందర్భంగా శ్రీనివాస్ న్యాయమూర్తితో మాట్లాడుతూ నాకు నా భావాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించాలి. అందుకు నాకు పుస్తకం రాసే అవకాశం కల్పించాలని న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు.
