రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైయస్ఆర్సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలపట్ల ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. జగన్ నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీనేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్నాయుడు, సుధాకర్, మోహన్ రెడ్డి, భాను ప్రకాశ్రెడ్డి, మధుసూదన్, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి పాల్గొన్నారు. పెళ్లకూరు మండలం కొత్తూరులో ఇంకా వేరే పార్టీ ఉండదని అందరం వైసీపీవైపే ఉన్నారంటూ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు రానున్న నేపధ్యంలో పార్టీ నేతలతోపాటు ప్రజలు కూడా మొత్తం కుటుంబంతో సహా వైసీపీలో చేరుతుండడం ఆపార్టీ నాయకులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.