Home / 18+ / రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏమైపోయాడు.? టీడీపీ ప్రభుత్వం విచారణకు

రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏమైపోయాడు.? టీడీపీ ప్రభుత్వం విచారణకు

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌ దాఖలు చేసే సమయం దగ్గరపడినపుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్‌ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్‌ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ హత్యాయత్నం కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని న్యాయవాది వెంకటేశ్‌ శర్మ ఆరోపించారు.

ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తే.. అసలు కుట్ర దారులు బయటికొస్తారనే భయంతోనే కేసును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామని శర్మ స్పష్టం చేశారు. ఈ కేసులో కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు, విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి ఎన్‌ఐఏ విచారణకు వెళ్లలేడు. హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్‌ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపారు. నిజానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్‌ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

పైగా హర్షవర్ధన్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతోపాటు కొద్దిరోజులుగా పత్తా లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి యనమల నగరానికి వచ్చినప్పుడు హల్‌చల్‌ చేశాడని, ఆ తర్వాత నుంచి కానరావట్లేదని చెప్తున్నారుజ ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్‌ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్‌ఐఏ వర్గాలు మాట్లాడుతూ రెండు రోజులు చూసి హర్షవర్ధన్‌ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అయితే NIA Charge sheet ప్రకారం ఒకే నిందితుడు అయితే accused అని మాత్రమే ఉంటుందని కానీ ఇక్కడ ఏ1 అంటే ఇంకా కుట్ర దారులు, పాత్రదారులు ఉన్నారు అనేది స్పష్టం చేసింది. నింధితుడు శ్రీనివాస్ కచ్చితంగా జగన్ ని చంపుదాం అనే ఉద్దేశంతో వచ్చాడని, అందుకే 2018 జనవరిలోనే కత్తి కొన్నాడు.

దాడికి ఒక రోజు ముందు ఆ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిని సహా కోసం అడిగాడు. జగన్ అభిమాని అయితే కచ్చితంగా పార్టీ నాయకులని పరిచయం చెయ్యమని అడిగేవాడు. కానీ అక్కడ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిని అడిగాడు. కచ్చితంగా చంపాలి అనే ఉద్దేశంతోనే VIP లాంజ్ లోకి వెళ్ళాడు. NIA కస్టడీలో ఉన్నప్పుడు విచారణ లో క్లియర్ గా గా జగన్ మీద దాడి చేశాను అని మధ్యవర్తి సమక్షంలో ఒప్పుకున్నాడు నింధితుడు శ్రీనివాస్. నిందితుడి మీద పోలీసు కేసు ఉన్న విషయాన్ని ఎయిర్ పోర్టు అధికారులు కూడా చూడలేదు. ఎన్ఐఏ రిపోర్టులో కూడా విచారణ ఇంకా ముందుకు వెళ్ళాలి అని రాశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat