Home / 18+ / నియోజకవర్గాల వారీగా విజయవంతంగా పలు కార్యక్రమాలు

నియోజకవర్గాల వారీగా విజయవంతంగా పలు కార్యక్రమాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పూర్తి అయిన నేపధ్యంలో జగన్ మరింత వేగంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం తిరుపతిలో సమర శంఖారావం సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని యోగానంద్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్స్ లో జరగనున్న తటస్థుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహం ఒంటి గంటకు సమర శంఖారావం సదస్సుకు వైయ‌స్‌ జగన్‌ హాజరవుతారు. మరోవైపు వైసీపీ శ్రేణులంతా ఆయా నియోజకవర్గాల వారీగా రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంతో పాటు నిన్ను నమ్మం బాబూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat