సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…టీడీపీ సీనియర్ నేత. మీడియాలో తరచు కనిపించే నాయకుడు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగే నాయకుడు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది మంత్రుల వలే…సోమిరెడ్డి సైతం ఘోర పరాజయం పాలయ్యారు. అయితే, మిగతా మంత్రులది ఒక ఎత్తు…సోమిరెడ్డి ఓటమి ఒక ఎత్తు అంటున్నారు. ఆయనకు ఓటమి కంటే అవమానం ఎక్కువ జరిగిందని చెప్తున్నారు.
సర్వేపల్లి నుంచి బరిలో దిగుతున్న సోమిరెడ్డిని విజయం వరించిన సందర్భాల కంటే ఓటమి పాలైన ఉదంతాలే ఎక్కువగా ఉన్నాయి. సోమిరెడ్డి సర్వేపల్లి నుంచి 1994, 1999లలో విజయం సాధించారు. అయితే వరుసగా ఆయన మూడుసార్లు ఓటమి పాలయ్యారు. 2004లో సోమిరెడ్డిపై కాంగ్రెస్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి 7వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా కాంగ్రెస్ నుంచి ఆదాలనే సోమిరెడ్డిపై 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఐదువేల పైచీలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కట్ చేస్తే…తాజాగా వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలవడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుకొని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి ఎమ్మెల్యే బరిలో సోమిరెడ్డి దిగారు. అయితే, ఆయనకు మళ్లీ ఓటమి తప్పలేదు. వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం ఓటమి మాత్రమే కాకుండా..కేబినెట్ మంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో దపా ఓడిపోయిన నాయకుడిగా సోమిరెడ్డి నిలిచారు.ఇతను సోమిరెడ్డి కాదు..సోదిరెడ్డి అని మరోసారి నిరూపించుకున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.