ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగన్ వైపే మొగ్గుచూపారు.చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఏపీకి చేసింది ఏమీ లేదనే చెప్పాలి ఎందుకంటే..టీడీపీ పార్టీ వాళ్ళు చేసినన్ని అక్రమాలు,అన్యాయాలు ఎవరూ చేసుండరు.ఇసుక మాఫియా, జన్మభూమి కమిటీ అగ్రిగోల్ద్ ఇలా అన్నింటిలో ప్రజలను మోసం చేసారు.ఈమేరకు ఎన్నికల్లో చంద్రబాబు కి సరైన బుద్ధి చెప్పారు.ఇదంతా ఒకటి అయితే చంద్రబాబు కొత్తగా మరో రికార్డు సృష్టించారు.
తండ్రి కొడుకుల చేతిలో ఘోరంగా ఓడిపోయిన వ్యక్తిగా చంద్రబాబు నిలిచాడు.అప్పట్లో 2004ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పై చంద్రబాబు ఘోరంగా ఓడిపోయిన సంగతి అందరికి తెలిసిందే.ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై బాబు గెలవలేకపోయాడు.అయితే 2014 ఏవో మాయమాటలు చెప్పి,దొంగ హామీలు ఇచ్చి పొత్తు పెట్టుకొని గెలిచారు.ప్రస్తుతం 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా పెద్దాయన కొడుకు వైఎస్ జగన్ పై అతి దారుణంగా ఓడిపోవడం జరిగిగింది.ఎంత దారుణం అంటే ఒక అధికార పార్టీ అయి ఉండి కనీస సీట్లు కూడా గెలవలేకపోయింది.