సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు విషయంలో చకచక పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు సాయంత్రం 6.03 నిముషాలకు చిత్ర ట్రైలర్ విడుదల డేట్ ప్రకటించనున్నారు. ఈనెల 23న అనీల్ బర్త్ డే సందర్భంగా ఆ రోజునే రిలీజ్ చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. మొత్తానికి ఈ సస్పెన్స్ కి సాయంత్రంతో క్లారిటీ రానుంది.
