విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్-1లో 110, గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. …
Read More »అదేంటి.. ప్రభాస్ గురించి రాజమౌళి అంతమాట అనేశాడు!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు RRR సినిమాపైనే ఉన్నాయి. ఈనెల 25న మూవీ రిలీజ్ అవుతుండటంతో ఎప్పుడు చూసేస్తామా అనే ఆతృతలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుంటంతో మూవీ టీమ్ ప్రమోషన్ ఈవెంట్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, చిట్ చాట్ …
Read More »ఆ ప్రచారం కరెక్ట్ కాదు..: చినజీయర్ స్వామి
విజయవాడ: కొత్తగా ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయని.. తామెప్పుడూ ఆదివాసీలు, మహిళలను చిన్నచూపు చూడలేదని చినజీయర్ స్వామి అన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణలో పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఆ వ్యాఖ్యల ముందు వెనుక ఏం జరిగిందన్నది …
Read More »యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ రిజల్ట్స్ విడుదల
దిల్లీ: యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సివిల్స్ మెయిన్ ఎగ్జామ్-2021 రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఆల్ ఇండియా సర్వీసుల్లో అధికారుల నియామకం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్ పరీక్షలను నిర్వహించారు. మెయిన్స్లో దేశవ్యాప్తంగా 1,823 మంది ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు. వీరికి ఏప్రిల్ 5 …
Read More »RRR..ఏపీలో అదనపు టికెట్ రేట్లకు గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే!
ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్ మినహా నిర్మాణానికే రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ …
Read More »RRR మానియా స్టార్ట్.. ప్రీరిలీజ్ ఈవెంట్ల షెడ్యూల్ ఇదే!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మానియా స్టార్ట్ అవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్తో విపరీతంగా ప్రేక్షకులకు సినిమా విశేషాలు చేరువయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్చరణ్ కనిపించనున్నారు. ఈనెల 25నే మూవీ రిలీజ్ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందండంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. విదేశాల్లోనూ …
Read More »బండి సంజయ్.. కరీంనగర్కు ఏం చేశావ్?: కేటీఆర్
కరీంనగర్: సొంత నియోజకవర్గ యువతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వినోద్కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని.. ఇప్పుడు ఎంపీగా ఉన్న సంజయ్ ఏం తీసుకొచ్చారని నిలదీశారు. కరీంనగర్ జిల్లాను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ఇక్కడి నుంచే మొదలుపెడతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే …
Read More »దుల్కర్కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్
మహానటి సినిమాలో సావిత్రి భర్తగా నటించి అందరి మన్ననలు పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్పై బ్యాన్ విధించింది కేరళ థియేటర్స్ అసోసియేషన్. ఈ మలయాళీ హీరో నటించిన మూవీస్ కేరళలోని థియేటర్లలో ఇకపై రిలీజ్ చేయకూడదని నిర్ణయించింది. ఈమధ్య దుల్కర్ మూవీ ‘సెల్యూట్’ ఓటీటీలో విడుదల అయింది. అదే ఈ నిర్ణయానికి కారణం. ‘సెల్యూట్’సినిమాకి ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ …
Read More »మార్కెట్లో 5జీ మొబైల్.. తక్కువ ధరలకే..
దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్కు క్యూ కడుతున్నాయి. గతంలో మినిమం రూ.20వేలు పెడితే తప్ప స్మార్ట్ ఫోన్ వచ్చేది కాదు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రూ.5వేల నుంచే స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అయితే త్వరలో 5జీ తరం రాబోతోంది. అందుకే ముందుచూపుతోనే మార్కెట్లోకి మొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు కూడా కామన్ పీపుల్కి అందుబాటులో ఉంటున్నాయి. లేటెస్ట్గా ఐకూ సంస్థ రూ.15వేలకే …
Read More »బీజేపీ నేతలూ.. గేమ్ ముగిసిపోలేదు: మమత
కోల్కతా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచినంత మాత్రాన గేమ్ ముగిసిపోలేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కోల్కతాలో మీడియాతో మమత మాట్లాడారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కావని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆ పార్టీకి లేరని.. అందుకే గేమ్ ఇంకా …
Read More »