ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ చేసిందేమీ లేదంటూ సికింద్రాబాద్లో భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మోదీ బహిరంగసభ జరగనుంది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే మోదీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదంటూ టివోలీ థియేటర్ సిగ్నల్ సమీపంలో ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నోట్ల రద్దు, ప్రభుత్వసంస్థల అమ్మకం, అగ్నిపథ్, రైతు …
Read More »హేమచంద్ర, శ్రావణ భార్గవి డైవర్స్?..క్లారిటీ ఇచ్చిన సింగర్స్
తెలుగు సినిమా రంగంలో హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట మంచి గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో లవ్లో ఉన్న ఈ జంట.. 2009లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ స్పందించారు. ఇన్స్టాలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవాలేనని …
Read More »కొల్లాపూర్లో సై అంటే సై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
కొల్లపూర్కి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొల్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లపూర్నియోజకవర్గంలో టీఆర్ఎస్పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్ అభివృద్ధిపై …
Read More »ఆత్మకూరు బైపోల్.. వైసీపీకి తిరుగులేని విజయం
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్కుమార్ యాదవ్పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్రెడ్డి గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన …
Read More »టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …
Read More »లావణ్య త్రిపాఠిని ఇలా చూస్తే మతిపోవాల్సిందే..
అందాల రాక్షసి, భలే .. భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా వంటి పలు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హ్యాపీబర్తడే అనే మూవీలో నటిస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీలోని కొన్ని లుక్స్తో మతిపోగొడుతుంది ఈ భామ.
Read More »నిఖిల్ చేసిన పనికి షాకైన అభిమాని
హీరో నిఖిల్ తన అభిమానికి సూపర్ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కార్తికేయ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్ అనే వ్యక్తిని స్టేజ్ పైకి పిలిచి తన కళ్లద్దాలను గిప్ట్గా ఇచ్చేశాడు. ఇంతకీ నిఖిల్ ఎందుకు ఇలా చేశాడో తెలుసా.. నిఖిల్ నటించిన కార్తికేయ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. నిఖిల్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ తనపై అమితమైన అభిమానాన్ని …
Read More »ఘోరం.. బైక్పై వెళ్తూ అన్నదమ్ముల సజీవ దహనం
ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని దేవులపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు సజీవ దహనమయ్యారు. శుక్రవారం ఉదయం పాలు తెచ్చేందుకు పొలం వద్దకు అన్నదమ్ములు నాగేంద్ర, ఫణీంద్ర బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్పై 11 కేవీ లైన్ కరెంట్తీగలు పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి అన్నదమ్ములు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వీరిలో నాగేంద్ర ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్సెకెండ్ఇయర్ చదువుతున్నారు. అందివచ్చిన కొడుకులిద్దరూ ఇలా …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …
Read More »మెగాస్టార్ కొత్త సినిమా వచ్చేస్తుందోచ్..
మెగాస్టార్ అభిమానులకు గుడ్న్యూస్. త్వరలో చిరు, బాబీ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్యానర్పై మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ను ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో అలరించనుంది. ఇందులో చిరు సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా …
Read More »