భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్తో పాటు న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్తో టీ20 సిరీస్కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 …
Read More »ఘనంగా క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, …
Read More »పాత డెబిట్ కార్డులిక పనిచేయవు..
పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి పనిచేయవు. జనవరి 1 నుంచి రూ పే, మాస్టర్కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే …
Read More »నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …
Read More »కలకలం రేపుతున్న పసికందుల విక్రయాలు.!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ.జీ.హెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జోరుగా పిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.గర్భిణీలు వదిలి వెళ్ళిపోయినా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వదిలేద్దామనే మహిళలకు వలవేస్తున్న ఆ ఆసుపత్రికి చెందిన సెక్యూరిటీలో కొందరు సిబ్బంది వల వేసి వారి వద్ద నుంచి పసికందులను సేకరించి ఆడ బిడ్డకు ఓ రేటు మగ బిడ్డకో రేటు చప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కోవలో జీజీహెచ్ లో సెక్యూరిటీ …
Read More »చంద్రబాబు,టీడీపీ ఎంపీలు అలా చేస్తున్నారా…థూ మీ బతుకు చెడ
తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ …
Read More »రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్..
సూపర్ స్టార్ రజినీకాంత్తో ఒక్కసారైన నటించాలని సగటు నటీనటులు అనుకోవడం సహజం. ఒకవేళ అనుకోకుండా వారిని అదృష్ట దేవత తలుపు తడితే వారి ఆనందానికి అవధులే ఉండవు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా త్రిషకి అవకాశం దక్కింది. దీంతో ఆ అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్.. రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. …
Read More »అనుభవంలేని అక్కను బలి పశువును చేయడం, తన సినిమాలకు ధియేటర్లు లేకుండా చేయడం, తండ్రి చావు వద్ద రాజకీయం..
ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి …
Read More »జీఎస్ఎల్వీ-ఎఫ్11 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ యాంగ్రీ బర్డ్గా పిలుస్తున్న దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఏను బుధవారం సాయంత్రం విజయవంతంగా రోదసిలోకి పంపింది. శ్రీహరికోట లోని సతీశ్ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) లోని రెండవ ప్రయోగవేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జీశాట్-7ఏను తీసుకుని జీఎస్ఎల్వీ మార్క్-2 ఎఫ్-11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల వ్యవధిలోనే.. జీశాట్-7ఏ …
Read More »ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు తుని రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉందని, ఘటన జరిగిన మూడేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ …
Read More »