Home / POLITICS (page 55)

POLITICS

టీడీపీకి ఏపీలోనూ తెలంగాణ పరిస్థితే..: దివ్యవాణి

తెలంగాణలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని సినీనటి దివ్యవాణి అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక కొంతమంది పనికిమాలిన చెత్తవెదవలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకోసం కష్టపడినా గుర్తింపు లేకపోవడంతోనే బయటకు వచ్చేశానన్నారు. టీడీ జనార్దన్‌ కోవర్టులతో తప్పులు చేయిస్తున్నారని.. నిజాయితీగా ఉండబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నానని దివ్యవాణి అన్నారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేసినా తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More »

1998 డీఎస్సీ.. వైసీపీ ఎమ్మెల్యేకి టీచర్‌ జాబ్‌!

సీఎం జగన్‌ తీసుకున్న చొరవతో 1998 డీఎస్సీ అభ్యర్థుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఇటీవల ఎంపిక జాబితాను ప్రభుత్వం ప్రకటించగా అందులో వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చేసిన ఆయన.. సుమారు పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాశారు. వివిధ కారణాలతో 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇన్నాళ్లూ నిరీక్షణ తప్పలేదు. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో ధర్మశ్రీ పేరు ఉండటంతో …

Read More »

రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్‌ మద్దతు ఆయనకేనా!

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌ సిన్హాకు కేసీఆర్‌ మద్దతిస్తారని శరద్‌ పవార్‌ చెప్పారు. ముంబయిలో …

Read More »

ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్‌

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను వెంటనే పూర్తిచేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కర్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని.. నాడు-నేడుతో చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. జులై 15 నాటికి గుంతలన్నీ పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలో పెట్టాలని సీఎం …

Read More »

దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు: కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఈ 8 ఏళ్లలో హైదరాబాద్‌లో 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి సూచిక ప్రజా రవాణా, రహదారులేనని చెప్పారు. కూకట్‌పల్లిలోని కైతలాపూర్‌ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. …

Read More »

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్‌రావు

కేసీఆర్‌ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …

Read More »

ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామన్న పవన్‌… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …

Read More »

రూ.40వేల కోట్ల భూములు.. మాకు అప్పగించేయండి: కేటీఆర్‌

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీలను అమలు చేయడం లేదని టీఆర్‌ఎస్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ …

Read More »

రాకేష్‌ పాడె మోసిన టీఆర్‌ఎస్‌ మంత్రులు

సికింద్రాబాద్‌ అగ్నిపథ్‌ ఆందోళనల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేష్‌ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్‌ జిల్లా దబీర్‌పేట స్మశానంలో రాకేష్‌ మృతదేహానికి ఆయన తండ్రి కుమారస్వామి నిప్పంటించారు. అంతకుముందు నర్సంపేట చేరుకున్న రాకేష్‌ మృతదేహానికి పెద్ద ఎత్తున ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆ తర్వాత అతడి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, …

Read More »

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రతిష్ఠకు భంగం కలగొద్దు: విద్యార్థులకు మంత్రి సబిత లేఖ

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్‌ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat