తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More »పెళ్లీ పీటలు ఎక్కనున్న నయనతార
సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రేమ పక్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్దరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీని కోసం వీరిద్దరూ తమ పెళ్లి కోసం వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమలలో పర్యటిస్తున్నారు. …
Read More »దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. నిన్న శుక్రవారం 3545 కేసులు నమోదైన సంగతి తెల్సిందే. తాజాగా కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి. ఇందులో 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,024 మంది మృతిచెందగా, 20,303 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 22 మంది కరోనాతో మరణించగా, 3168 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »కొత్త టాకీసులో పాత సినిమాలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ …
Read More »తెలంగాణలో కాంగ్రెస్ కొత్త డ్రామాలు
పంజాబ్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తరా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్ చేయరా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 ఏండ్ల కాలంలో రైతుబీమా గురించి ఏనాడైనా ఆలోచించారా అని రాహుల్ …
Read More »కైటెక్స్ అపెరల్ పార్కుకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ …
Read More »పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: రాహుల్
ఎంతోమంది యువత, తల్లుల రక్తం, ఆయా కుటుంబాల కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ మాట్లాడారు. ఏ కలలు నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని.. అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో …
Read More »పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్.. ఏపీ వ్యాప్తంగా బోర్లకు మీటర్లు: జగన్
ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన …
Read More »కాబోయే భర్త అని కూడా చూడకుండా అరెస్ట్ చేసిన లేడీ ఎస్సై
తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా ఓ వ్యక్తిని లేడీ ఎస్సై అరెస్ట్ చేసేసింది. ఈ ఘటన అస్సాంలోని నాగాన్ జిల్లాలో చోటుచేసుకుంది. రాణా పొగాగ్ అనే వ్యక్తి ఓఎన్జీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందిని మోసం చేశాడు. జున్మోణి అనే యువతి ఎస్సైగా పనిచేస్తోంది. రరాణా పొగాగ్ అనే వ్యక్తికి ఆమెతో ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఆమె ఎస్సైగా పనిచేస్తున్న చోటే అతడిపై కేసు నమోదైంది. రూ.కోట్లలో …
Read More »బండి సంజయ్ కౌన్సిలర్గా కూడా పనికిరారు: శ్రీనివాస్గౌడ్
ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలుపెట్టి.. మతం, కులం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. పచ్చని పాలమూరు జిల్లాలను ఆయన విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్కు కాళేశ్వరం …
Read More »