తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరీంనగర్ వెళ్టుండగా రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్ కు ఈ సంఘటన ఎదురైంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న …
Read More »చిన్నారుల మనసును గెలిచిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే చిన్నారి తన ప్రాజెక్టు వర్క్ లో మంత్రి పువ్వాడపై వ్యాసం.. ఐదో తరగతి చదువుతున్న ఆశ్రిత్ నాయుడు.. సామాజిక సేవా దృక్పథం గురించి సొంత వ్యాసం రాయమని విద్యార్థులకు టాస్క్ దీంతో జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారు చేస్తున్న సామాజిక సేవలపై వ్యాసం రాసిన అశ్రిత్ నాయుడు.. జిల్లాలో కరోనా కట్టడీపై మంత్రి పువ్వాడ తీసుకున్న చర్యలు బాగున్నాయని చిన్నారి …
Read More »ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 88,441 మందికి కరోనా టెస్టులు చేస్తే 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 80 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,49,363కు చేరగా ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 15,958 మంది కరోనాను జయించారు. మొత్తం 16,09,879 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,070 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 18 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,734కు చేరింది. ఇప్పటికీ 5,57,162 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ కరోనాతో 3,364 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 29,208 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 1,38,182 టెస్టుల చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పలు అంశాలపై సీఎం చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల నిధుల మంజూరు విషయాలపైనా కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడనున్నారు. అటు ప్రధాన మంత్రితో భేటీకి సీఎం కార్యాలయం సంప్రదించినట్లు తెలుస్తోంది.
Read More »కరోనా థర్డ్ వేవ్ ను ఇలా ఎదుర్కోవాలి
విటమిన్-D మోతాదు ప్రకారం తీసుకోవడం వల్ల కరోనా నుంచి కాపాడుకోవచ్చు! థర్డ్ వేవ్ ను అడ్డుకోవచ్చు. విటమిన్-Dతో కరోనా సివియర్ కాకుండా ఆపుతున్నాం. కాబట్టి.. బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు తక్కువే. విటమిన్-డీ కోసం చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలతో పాటు సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా విటమిన్ Dతో కరోనా నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read More »పెళ్లి పై అంజలి క్లారిటీ
తెలుగు భామ అంజలి.. పెళ్లి గురించి స్పందించింది. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో అలరించింది అంజలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు.. మీది ఎప్పుడు అని అడగ్గా.. ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది. తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడలోనూ నటిస్తోంది. అంజలి, తమిళ హీరో జై తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
Read More »TRS ఎమ్మెల్యేకి చిరు ఫోన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. శంకర్ నాయక్ ముచ్చటించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి.. సిలిండర్లను పంపించారని తెలిపారు శంకర్ …
Read More »చెరుకు రసంతో లావు తగ్గుతారా..?
ప్రస్తుత రోజుల్లో పొట్ట తగ్గడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యలుగా మారాయి. ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం బరువు తగ్గించగలదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలదు. అంతేకాదు, ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. సో.. రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగేయండి. హెల్తీగా ఉండండి.
Read More »తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడంటే…?
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డ్ డౌన్ మరోసారి పొడిగించవద్దని సర్కారు భావిస్తోంది. పగటి పూట పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని సమాచారం. వ్యాపారాలతో పాటు మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9తో లాక్ …
Read More »