Home / SLIDER (page 958)

SLIDER

తొలిసారిగా మిల్క్ బ్యూటీ తమన్నా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… మిల్కీ బ్యూటీ తమన్నా ‘సీటీమార్’లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. తెలంగాణ యాసలో ఈ అమ్మడు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం సరదాగా ఉంది. డబ్బింగ్ లో దర్శకుడు సంపత్ నంది నాకు సహాయం చేశారు’ అని పోస్ట్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో …

Read More »

తెలంగాణలో కొత్తగా 313 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 142 మంది బయటపడగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకోగా, 2,98,262 మంది కోలుకున్నారు. ఇప్పటిరకు మహమ్మారివల్ల 1664 మంది మృతిచెందారు. మరో 2434 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 …

Read More »

ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా ప్రకటన

 ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ కోసం టీమిండియాను ప్ర‌క‌టించింది బీసీసీఐ. సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి వ‌న్డే టీమ్‌లో చోటు ద‌క్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచ‌రీతో మెరిసిన సూర్య‌కుమార్ ఇక వ‌న్డేల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వ‌న్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఇంకా గాయాల నుంచి కోలుకుంటుండ‌టంతో వాళ్ల పేర్ల‌ను ప‌రిశీలించ‌లేదు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌లో టీమ్‌లో …

Read More »

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …

Read More »

అందాలు ఆరబోస్తూ ఇరగదీసిన అనసూయ- మీరు ఒక లుక్ వేయండి

అందాల భామ అన‌సూయ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యాంక‌ర్‌గానే కాదు న‌టిగాను ఈమె ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందిస్తుంది. ఇక వీలున్న‌ప్పుడల్లా చిందులేస్తూ యూత్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ అనే కామెడీ షోను హోస్ట్ చేస్తున్న అన‌సూయ ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి న‌టించిన లంకేశ్వ‌రుడు సినిమాలోని జివ్వుమ‌ని కొండ‌గాలి అనే పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసింది. అన‌సూయ డ్యాన్స్‌ను చూసి నెటిజ‌న్స్ మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు. …

Read More »

తెలంగాణలో త్వ‌ర‌లోనే స‌మ‌గ్ర భూ స‌ర్వే

త్వ‌ర‌లోనే రాష్ర్టంలో సమ‌గ్ర భూస‌ర్వే చేప‌డుతామ‌ని, ఇందు కోసం బ‌డ్జెట్‌లో రూ. 400 కోట్లు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు వెల్ల‌డించారు. ప‌క్కాగా భూ రికార్డులు త‌యారు చేసే ల‌క్ష్యంతో డిజిటల్ విధానంలో స‌మ‌గ్ర భూ స‌ర్వే జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం గ‌త సంవ‌త్స‌రం నిర్ణ‌యిచింది. ఈ స‌ర్వే ఆధారంగా అక్షాంశ‌, రేఖాంశాల‌తో స‌హా స్ప‌ష్ట‌మైన హ‌ద్దుల వివ‌రాల‌తో పాస్‌బుక్‌లు అందించ‌నున్నామ‌ని తెలిపారు. ఈ విధానం వ‌ల్ల రికార్డుల వ‌క్రీక‌ర‌ణ‌కు ఎంత …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22- రైతుల రుణాలు మాఫీకి 5,225 కోట్లు

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ. ల‌క్ష లోపు రుణాలున్న రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటామ‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా మంత్రి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాల‌ను మాఫీ చేశామ‌ని తెలిపారు. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మిగ‌తా రుణాలను మాఫీ చేయ‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ రుణాల‌ను మాఫీ …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22- మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు

తెలంగాణ రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చించి అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే అభివృద్ధిలో అగ్ర‌గామిగా ఉన్న హైద‌రాబాద్‌కు తాజా బ‌డ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్ప‌టికే న‌గ‌ర వ్యాప్తంగా 9 ఫ్లై ఓవ‌ర్లు, 4 అండ‌ర్ పాస్‌లు, 3 ఆర్‌వోబీలను పూర్తి చేసుకున్నామ‌ని మంత్రి తెలిపారు. క‌రోనా లాక్‌డౌన్‌లో రూ. 2 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవ‌ర్లు, 300 …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22-GHMCలో ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు

ఇటీవ‌ల జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీ మేర‌కు ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం ఈ బ‌డ్జెట్‌లో రూ. 250 కోట్ల‌ను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ప్ర‌తీ కుటుంబానికి 20 వేల లీట‌ర్ల సుర‌క్షిత మంచినీటికి ఉచితంగా అందిస్తున్న‌ట్లు చెప్పారు. దీని వ‌ల్ల పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై వాట‌ర్ బిల్లుల భారం త‌గ్గింద‌న్నారు. న‌గ‌ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ తాగునీటి అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగ‌ర్ …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22-వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద‌పీట

తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద‌పీట వేసింది. బ‌డ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌క‌టించారు.క‌రోనా ప్ర‌భావాన్ని త‌ట్టుకొని నిల‌బ‌డిన ఒకే ఒక్క రంగం వ్య‌వ‌సాయం అని పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీప‌న చ‌ర్య‌ల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల కార‌ణంగా.. నేడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat