ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2,71,282 ఉన్నాయని పేర్కొంది. మరో 154 మంది మహమ్మారికి బలవగా.. మృతుల సంఖ్య 1,59,370కు పెరిగింది.
ఓ వైపు పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 3,93,39,817 డోసుల వ్యాక్సిన్ వేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో పరీక్షలు సైతం భారీగానే జరుగుతున్నాయి. గురువారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 10,57,383 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 23.13కోట్లకుపైగా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.