కుల రహిత సమాజం కోసం పాటుపడి, దళితుల అభ్యున్నతి కోసం అనేక సేవలను అందించిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నందు నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారితో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి …
Read More »అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్ పై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అక్కడే ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం …
Read More »అంబేద్కర్, జగ్జివన్రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు- మంత్రి హరీష్రావు
జగ్జివన్రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్రావు అన్నారు. మంగళవారం జగ్జివన్రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్ను కొనియాడారన్నారు. ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా.. చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. …
Read More »జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్ ఫార్మాలో కేటీఆర్ మొక్క నాటారు. అనంతరం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరమన్నారు. 200 మందికి జాంప్ ఫార్మా ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారని చెప్పారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా …
Read More »డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ గారు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.ఏప్రిల్ 05, 2022వ తేదీ జగ్జీవన్రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం తెలంగాణతల్లి సర్కిల్ లో గల జగ్జీవన్ రాం గారి విగ్రహానికి, Vdo’s కాలనీ క్యాంపు కార్యలయం, గట్టయ్య సెంటర్ లోని తెరాస జిల్లా పార్టీ …
Read More »అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్
సమాజంలో కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని పేర్కొన్నారు. మంగళవారం జగ్జీవన్రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులు అర్పించారు. జగ్జీవన్రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని …
Read More »డీకే శివకుమార్ ఛాలెంజ్.. కేటీఆర్ కౌంటర్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని.. రోజూ పవర్కట్లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్ నరేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేర్కొన్నారు. …
Read More »యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధి: ఆనందసాయి
యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఆయన చెప్పారు. అధికారులతో వేములవాడ ఆలయ పరిసరాలను ఆనందసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్త కలిసి ఆలయాన్ని పరిశీలిస్తానని.. మరో 15 …
Read More »‘లిక్కర్ మత్తులో జోగుతోంది కాంగ్రెస్, బీజేపీ నేతల పిల్లలే’
బంజారాహిల్స్ పబ్లో డ్రగ్స్ దొరికిన ఘటనలో చేపట్టిన చర్యలు ప్రభుత్వం, పోలీసుల పనితీరుకి నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. డ్రగ్స్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పబ్పై పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. ఈ వ్యవహారంలో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట …
Read More »టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం
ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనకు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విషయం విదితమే. రైతులు …
Read More »