సర్కారు ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకోసం టీఎస్పీఎస్సీ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు ఏర్పాడ్డాయి. దీంతో అభ్యర్థుల స్థానికత మారిపోయింది.
Read More »నేత్రపర్వంగా మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
తెలంగాణ రాష్ట్రంలో శ్రీలక్ష్మీ నరసింహా స్వామి కొలువై ఉన్న యాదాద్రిలో ఈరోజు సోమవారం మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఇందులో భాగంగా దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్కు కంకణధారణ చేసి ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. …
Read More »బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష: బాల్క సుమన్
ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. ధాన్యం సేకరణపై పెద్దన్న పాతర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. దుర్మార్గం …
Read More »తెలంగాణ ప్రజల్ని పీయూష్ గోయల్ అవమానించారు: హరీష్రావు
తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారని మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వాలని …
Read More »సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ధూల్పేటలో ఒక బర్త్డే పార్టీకి రూ. 10 లక్షలు ఖర్చు చేస్తారు.. …
Read More »కేంద్రానికి మంత్రి పువ్వాడ వార్నింగ్
వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …
Read More »గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన ఈడీతో పాటు ఇద్దరు ఆర్ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్లో బస్సుల ఆపరేషన్స్పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ జోన్ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …
Read More »ఎయిరో స్పేస్ తయారీ హబ్గా హైదరాబాద్-మంత్రి వేముల
ఎయిరో స్పేస్ (aerospace) తయారీ హబ్గా హైదరాబాద్ (Hyderabad) ఎదుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్కు గర్వకారణమన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »కళ్యాణ లక్ష్మీకి ప్రేరణ అయిన కల్పన కూతురు చంద్రకళ పెళ్లికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం 10 లక్షల మంది ఆడ పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలతో …
Read More »పీయూష్ గోయెల్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి -గుర్రాల నాగరాజు (TRS NRI సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు ).
తెలంగాణ రైతులపై కేంద్రం ముందునుంచే చిన్న చూపు చూస్తుంది, యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన తెరాస మంతులతో అహంకారపూరితనగా మాట్లాడిన పీయూష్ గోయెల్ తెలంగాణ సమాజానికి , రైతాంగానికి క్షమాపణ చెప్పాలి గుర్రాల నాగరాజు డిమాండ్ చేసారు. తెలంగాణ లో వున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ గురించి ఆలోచించే సమయం లేదు , రోజుకో కొత్త వేషం వేషి అసలు సమస్యలను పక్కన పెడుతున్నారు …
Read More »