Home / TELANGANA (page 775)

TELANGANA

నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యేప‌ని కాద‌ని నిపుణ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ …

Read More »

తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ అధ్యక్షునిగా ఏకగ్రీవం

తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ కమిటీ రెండవ అధ్యక్షునిగా పటోళ్ల నరేందర్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా ఎర్రబల్లి వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా ఉమా సల్వాజీ, దయానంద్, కటకం, ట్రెజరర్ గా అరుణ్ కుమార్ ఫైడగమ్మల, జాయింట్ సెక్రటరీలుగా యాచమనేని విజేత, అల్లం కిరణ్ కుమార్, ముసుకు సాయిరెడ్డిలు ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి ఆద్వర్యంలో ఈ ప్యానల్ ఏర్పడింది. నూతన అధ్యక్షుడిగా …

Read More »

జయరాం హత్యకేసును చేధించిన పోలీసులు..

గత నెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు వెనుకసీటులో ఉన్నమృతదేహాన్ని కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు.ఇందులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని అరెస్టు చేశారు.పోలీసుల విచారణ అనంతరం రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్‌ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.ఇద్దరు విజయవాడ నుండి …

Read More »

కాంగ్రెస్ అంటేనే ఇంత‌…త‌న్నుకున్న రాష్ట్ర నేత‌లు

కాంగ్రెస్ నేత‌లంటే ఎలా ఉంటుందో తెలియ‌జెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం. సాక్షాత్తు ముఖ్య‌నేత‌ల సమ‌క్షంలో కొట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క సన్మాన సభ రసాబాసగా మారింది. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరూ కూర్చీలు విసురుకున్నారు. సీఎల్పీ నేత‌గా ఎన్నికైన భట్టి సన్మానించేందుకు శ్రీకాంత్ వేదికపైకి ఎక్కారు. వేదికపై …

Read More »

బ్రేకింగ్.. ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్ నగరం గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని వారు ఆదేశాలు జారీచేశారు.కాగా గతంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో …

Read More »

కేంద్ర బ‌డ్జెట్.. తెలంగాణ‌కు అన్యాయం..!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం నేడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నోసార్లు పలు ప్రతిపాదనలు సమర్పించినా బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించలేదు. మోడీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి కొత్త‌గా ఒక్క ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఆయా సంస్థలకు కేటాయించే నిధులు …

Read More »

కేసీఆర్ వ‌ల్ల తెలంగాణ రైతులు సృష్టించిన రికార్డు ఇది

తెలంగాణ రైతుల‌కు మాత్ర‌మే ద‌క్కిన అవ‌కాశం ఇది. ముఖ్య‌మంత్రి, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేసిన కృషి ష‌లితంగా దేశ‌వ్యాప్తంగా మ‌రెవ్వ‌రికీ ద‌క్క‌ని అవ‌కాశం దక్కింది. దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు …

Read More »

అమెరికాలో విద్యార్థుల అవ‌స్థ‌లు…కేటీఆర్ ఏం చేశారంటే..

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం కోసం వెళ్లి అవ‌స్థ‌లు ప‌డుతున్న విద్యార్థుల అంశం అనేక‌మంది త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌చివేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పిల్ల‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయో తెలుసుకునేందుకు అనేక‌మంది త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాతో ఆయ‌న స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కుంటున్న …

Read More »

హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం

బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.

Read More »

ప్రియాంక‌గాంధీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌విత‌

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాపకురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిజామాబాద్‌లో బుధవారం ట్విట్టర్ సంస్థ నిర్వహించిన ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమంలో ఆమె దేశవ్యాప్తంగా వివిధవర్గాల నుంచి వచ్చిన ట్వీట్లకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యక్షంగా హాజరైన యువత, విద్యార్థులు, మహిళలు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సంద‌ర్భంగా ఆమె రాష్ట్రం నుంచి మొద‌లుకొని జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కు స్పందించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat