Blog Layout

రోహిత్ అభిమానులకు శుభవార్త

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్  కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ లో ట్రోఫీతో అన్ని టీమ్ కెప్టెన్లు ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి రోహిత్ రాకపోవడంతో, అతని ఆరోగ్యం బాగా లేదని, ముంబై తొలి మ్యాచ్కు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. రోహిత్ తో …

Read More »

మహరాష్ట్రలో బీఆర్ఎస్ కు 200 సీట్లు ఖాయం

మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం గట్టి సంకల్పం కావాలని అన్నారు. మహారాష్ట్ర షెత్కరీ సంఘటన్ కు చెందిన నేతలను బీఆర్ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలో రైతులను ఏకతాటిపైకి తెచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. …

Read More »

వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 91.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,233కు చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.

Read More »

మహిళల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని వైసీపీ సీనియర్ నేత.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారని ఆయన చెప్పారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట భర్త ఉంటాడని హితవు పలికారు. ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదు. వైసీపీ పోవాలని వారు …

Read More »

అసెంబ్లీ ఎన్నికల బరిలో అశోక్ గజపతిరాజు

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కూతురు అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి, ఓడిపోయారు. మళ్లీ గజపతిరాజు …

Read More »

పుట్టపర్తిలో వేడెక్కిన రాజకీయం

ఏపీలో పుట్టపర్తిలో  అధికార పార్టీ అయిన వైసీపీ.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధిపై పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చెబుతున్నారు. తాము వచ్చాకే అభివృద్ధి జరిగిందంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. సత్తెమ్మ ఆలయం వద్ద తేల్చుకుందామంటూ పల్లె ప్రతిసవాల్ చేశారు. అలర్టైన పోలీసులు ఆలయం …

Read More »

దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో గత రెండు వారాలుగా   కరోనా వైరస్‌  వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో పాజిటివ్‌ …

Read More »

అంబేద్కర్ రాజ్యాంగం వల్ల తెలంగాణ సిద్ధించింది.

భారత రాజ్యాంగ నిర్మాత.. భారత రత్న బీఆర్‌ అంబేద్కర్‌  , మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌  జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్‌  అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ  రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న జగ్జీవన్‌ రామ్‌, 14న అంబేద్కర్‌ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్‌ సమావేశం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat