దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం పదిరోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ కర్ణన్ కు ఆదేశమిచ్చారు. హుజూరాబాద్ నియోజక …
Read More »Blog Layout
రామప్పకు యునెస్కో గుర్తింపు-సంబరాలు చేసుకున్న ములుగు తెరాస శ్రేణులు…
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో కాకతీయుల అద్భుత నిర్మాణ కళాఖండాలలో ఒక్కటిగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ కమిటీ( యునెస్కో) గుర్తింపు రావడం పైన టిఆర్ఎస్ శ్రేణులు పటకులు,బాంబులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.రామప్ప ఆలయంలో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్,మంత్రులు గంగుల కమలాకర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి,జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి,జల వనరుల చైర్మన్ విరమల్ల ప్రకాష్,వికలాంగుల కార్పొరేషన్ …
Read More »తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్
తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు. అందరూ ఆ దిశగా దృఢ …
Read More »ఎమ్మెల్సీ పోచంపల్లి కృషితో నెరవేరిన కల..
ములుగు జిల్లా పాలంపేటలో చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కొ గుర్తించింది..అత్యంత సృజనాత్మకంగా,శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణ లో సృష్టించిన ఆద్యాత్మిక ,సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది..ఇది యునెస్కో లో చేరటం మరింత అభివృద్దికి దోహదపడుతుంది.. ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రామప్ప అభివృద్దిపై నిర్విరామ కృషి చేసారు..గత ఏడేండ్లుగా నిత్యం రామప్పను సందర్శిస్తూ అందుకు సంబందించిన ప్రతినిదులను తీసుకువస్తూ …
Read More »సినీనటి జయంతి (76) కన్నుమూత
ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.
Read More »స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.
Read More »తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ
దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
Read More »ప్రభాస్ కి అరుదైన గౌరవం
ఎన్నో రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని నలువైపులా చాటిచెప్పిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. అరుదైన గౌరవం అందుకున్నాడు. ఆసియాలోని మోస్ట్ హ్యాండ్సమ్ మెన్-2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ ఇమ్రాన్ అబ్బాస్(PAK), జిన్ అకానిషి(జపాన్), కిమ్ హ్యూన్(సౌత్ కొరియా), నహన్ ఫాక్ (వియత్నాం), హువాంగ్ జియామింగ్(చైనా), వివియన్ డీసేనా(IND), ఫవాద్ ఖాన్(పాక్), తన్వత్ వట్టనాపుటి (థాయిలాండ్), వట్టనాపుటి(థాయిలాండ్), వాలెస్ హువో(తైవాన్) టాప్-10లో …
Read More »రామప్పకి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ దేశానికి మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం. నాడు కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారని, కాకతీయ శిల్పకళా నైపుణ్యం చాలా …
Read More »తెలంగాణలో నేటి నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.. మిగతా చోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు కార్డులు అందిస్తారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 3.08 లక్షల కార్డులను ఆమోదించగా, ఆగస్టు నుంచి వీరికి రేషన్ పంపిణీ చేయనున్నారు. తాజా కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 90.50 లక్షలకు చేరింది.
Read More »