Classic Layout

కుల వృత్తుల అభ్యున్న‌తికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి

తెలంగాణ రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్న‌తికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌త్స్య‌కారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. అన్ని వ‌ర్గాల అభివృద్ధికి చేయూతనిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో 9 లక్షల 12 వేల చేపపిల్లలను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాశ్ క‌లిసి విడుద‌ల చేశారు. ఈ …

Read More »

పోరాడటం తెలుసు..కొట్లాడటం తెలుసు..

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. తాము తెలంగాణ వాళ్లమని, ఎలా పోరాడాలో తమకు తెలుసునని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. బల్క్‌ డ్రగ్‌ పార్కును రాష్ట్రానికి కేటాయించకపోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ఇటీవల చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ శుక్రవారం స్పందించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపెట్టినా.. తమ విజయాలను, స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేదన్నారు. రాష్ట్రానికి …

Read More »

జడేజాపై బీసీసీఐ సీరియస్‌!

ఆసియాకప్‌ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలిసింది. దుబాయ్‌ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్‌లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …

Read More »

పూరీ జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సూసైడ్‌!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్‌ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్‌ అనే యువకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్‌.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో …

Read More »

మహేష్‌బాబుతో నటించిన ‘పెద్దాయన’ ఇకలేరు..

‘మహర్షి’ మూవీలో ప్రముఖ నటుడు మహేష్‌బాబుతో కలిసి రైతు పాత్రలో నటించిన గురుస్వామి ఇకలేరు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన.. శుక్రవారం చనిపోయారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ తనకు ఇష్టమైన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఆయుష్మాన్‌ భవ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో గురుస్వామి నటించడం.. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ‘మహర్షి’ సినిమాలో ఆయనకు …

Read More »

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయాలి: టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు

టీఆర్‌ఎస్‌ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్‌లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, మాలోత్‌ కవిత, లింగయ్య యాదవ్‌, మాగంటి గోపీనాథ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …

Read More »

ఈరోజు సిటీలో నైట్ ఆ టైం వరకు మెట్రో సేవలు..!

వినాయక నిమజ్జనానికి తరలివచ్చేవారి కోసం నేడు మెట్రో ట్రైన్ సేవలను పొడిగించినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఎల్‌బీనగర్, నాగోల్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎన్, ఎంజీబీఎన్ స్టేషన్లలో చివరి ట్రైన్ ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. అంటే చివరి స్టేషన్లకు 2 గంటలకు చేరుకుంటాయి. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చూడాలి అనుకుంటే ప్రయాణికులు సమీప స్టేషన్లు …

Read More »

తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!

హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …

Read More »

వేధించిన వ్యక్తితోనే అమలాపాల్ రెండో పెళ్లి..!

నటి అమలాపాల్ తన ఫ్రెండ్, పంజాబీ సింగర్ భవ్‌నిందర్‌సింగ్ దత్‌ను వివాహం చేసుకుందట. అయితే ఇటీవల తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమలాపాల్ భవ్‌నిందర్‌సింగ్ దత్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో భవ్‌నిందర్‌సింగ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం భవ్‌నిందర్‌సింగ్ తరఫు లాయర్ ఈ విషయం న్యాయస్థానంలో చెప్పి అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాడట. అందుకే భవ్‌నిందర్‌సింగ్‌కు గ్ బెయిల్ వచ్చిందని కోలీవుడ్‌లో న్యూస్ …

Read More »

మరోసారి బాలాపూర్‌ లడ్డూకి రికార్డు స్థాయి ధర

తెలంగాణ  రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat