టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్మీట్ నిర్వహించారు. జీవన్రెడ్డి, బాల్క సుమన్, పద్మాదేవేందర్రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు మాట్లాడారు.
మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త భారత్ కోసం కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీని స్థాపించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని.. కేసీఆర్ వెంటే తామంతా నడుస్తామన్నారు. కేసీఆరే దేశానికి నిజమైన ప్రత్యామ్నాయ నేత అని చెప్పారు. తెలంగాణ ప్రగతి నమూనాను దేశం మొత్తానికి విస్తరించి బంగారు భారత్గా మార్చాలన్నారు.