Classic Layout

దేశంలో కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త

‘జేమ్స్‌ బాండ్‌’ పాత్రలు అంటే ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు యావత్  ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించిన పాత్ర. అలాంటి పాత్రలో ఓ తెలుగు నటుడు కనిపిస్తే..? అంతకంటే అద్భుతం ఏముంటుంది? ఈ అవకాశం మెగా పవర్ స్టార్ .. స్టార్ హీరో  రామ్‌చరణ్‌ని వరించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆ పాత్రని సృష్టించిన చియో హోదారి కోకర్‌ ఇప్పుడు రామ్‌ చరణ్‌ని జేమ్స్‌ బాండ్‌ పాత్రకు …

Read More »

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో దోమతెరల్లో నిద్రపోయిన ఎంపీలు

నిత్యవసర వస్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసిన విప‌క్ష ఎంపీలను వారం రోజుల పాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. 24 మంది ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయాల‌ని విప‌క్ష ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో 50 గంట‌ల ధ‌ర్నా చేస్తున్నారు. అయితే పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద‌ టెంటు వేసుకునేందుకు విప‌క్ష ఎంపీల‌కు అనుమ‌తి ల‌భించింది. దీంతో వాళ్లు ఓపెన్‌గానే నిద్ర‌పోయారు. వ‌ర్షం ప‌డ‌డంతో పార్ల‌మెంట్ …

Read More »

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ అంక్షలు

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.సాయంత్రం 5.30 …

Read More »

ఆ స్టిక్కర్‌ ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధం?: మంత్రి మల్లారెడ్డి

క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్‌ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్‌ ఉన్న అంశం చర్చనీయాంశమైంది. బోడుప్పల్‌లో ఓ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్‌ అని.. దాన్ని మూడునెలల క్రితమే …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మదాపూర్‌, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పర్‌, బండ్లగూడ జాగీర్‌ ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అత్తాపూర్‌, శివరాంపల్లి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుండగా.. వాహనాలు ఇబ్బందులకు గురయ్యారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, గాజులరామారం, సుచిత్ర, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, కొంపల్లి భారీ …

Read More »

రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై ఆలియా షాకింగ్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ అగ్రహీరో రణ్‌వీర్‌సింగ్‌ ఇటీవల చేసిన న్యూడ్‌ ఫొటోషూట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాస్మోపాలిటన్‌ మ్యాగజైన్ కోసం ఆయన తీయించుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు ఆలియాభట్. ఆలియా తాను నటించిన డార్లింగ్స్‌ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రణ్‌వీర్ ఇష్యూపై విలేకరు ప్రశ్నించగా.. రణ్‌వీర్ నాకు క్లోజ్ …

Read More »

ఏవండీ.. ఇకపై ఆ జిల్లా బాధ్యత మీదే…!

ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్‌ కేరళలోని అలప్పుఝ  కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్‌ వెంకట్రామన్‌ కేరళ ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat