తానేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ కోసమేనని.. ఆ పార్టీ లైన్లోఏ ఉంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. పార్టీనుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నట్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదని.. ఇప్పుడు లొంగుతానా? …
Read More »